ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను కాపాడిన ఎమ్మెల్యే
- VOICE OF HERALD

- Jan 5, 2022
- 1 min read
గుంటూరు
బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను కాపాడిన గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా. వివరాల్లోకి వెళితే శ్రీనివాసరావు తోటకు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మణిపురం బ్రిడ్జి పై నుంచి ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆఫీసు నుంచి ఇంటికి వెళుతూ ఆత్మహత్య సంఘటనను గమనించి మహిళ ఆత్మహత్యాయత్నం ను విరమించారు.. ఘటనకు కారణాలను తెలుసుకొని, వివరాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పి ఇంటికి పంపించారు.



Comments