ఆగస్టు 15న ప్రొద్దుటూరులో "స్వచ్చ సంకల్ప దీక్ష" - ప్లాస్టిక్ రహిత పట్టణానికి ప్రజా సంకల్పం
- VOICE OF HERALD

- 3 days ago
- 1 min read
ఆగస్టు 15న ప్రొద్దుటూరులో "స్వచ్చ సంకల్ప దీక్ష" - ప్లాస్టిక్ రహిత పట్టణానికి ప్రజా సంకల్పం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును ఆవిష్కరించే లక్ష్యంతో ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో "స్వచ్చ సంకల్ప దీక్ష" కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రజా ఆరోగ్యాన్ని, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించడం, పారిశుధ్య నిర్వహణను సక్రమంగా చేయడం, ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం కోసం ఈ దీక్షను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో వేలాది మందితో ఈ మహోన్నత దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రొద్దుటూరు పురజనులతో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం జన సంకల్పం చేయించనున్నారు.
ఈ స్వచ్చ సంకల్ప దీక్షలో పురజనులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా నాయకులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, పౌర సంఘాల ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, దుకాణదారులు, వర్తక వ్యాపారస్థులు పాల్గొనాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆత్మీయ ఆహ్వానం పలికారు. ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిగా పట్టణం నుంచి తరిమికొట్టాలనే లక్ష్యంతో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు సహకరించాలని ఆయన కోరారు.



Comments