హనుమాపురంలో ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలు
- VOICE OF HERALD

- Jan 26, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, బొల్లాపల్లి మండలం, ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హనుమాపురం గ్రామం లో గల మండల ప్రాధమికొన్నత పాఠశాలలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలలో ప్రధాన ఉపాధ్యాయులు నరేంద్ర, ముఖ్య అతిధిగా పాఠశాల SMC చైర్మైన్ సక్రియా నాయక్, హనుమాపూరం సర్పంచ్ కేతావతు గున్ని బాయి,
సర్పంచ్ తనయుడు రామ్చంద్ నాయక్, విలేజ్ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్ లక్ష్మీ, ఆశ వర్కర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత గురించి ప్రధానోపాధ్యాయులు అయిన నరేంద్ర వివరించటం జరిగింది, ఆపై ప్రస్తుతం ఉన్న కోవిడ్ మహమ్మారి నుండి ఏవిధంగా జాగ్రత్తలు పాటించాలో తెలియ పరచడం జరిగింది. క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు, విద్యార్థులకు మిఠాయిలు పంచడం జరిగింది.



ఘనతంత్ర కాదండి గణతంత్ర అని టైటిల్ లో మిస్టేక్