రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత: ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత: ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పూల శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డుల (ఐడీ కార్డులు) ప్రాధాన్యతను నాయకులు, కార్యకర్తలకు వివరించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో స్థానిక నేతలు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





Comments