గ్రామ శుభ్రత మన బాధ్యత - ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి
- EDITOR

- Jun 10
- 1 min read

వైయస్సార్ కడప జిల్లా
పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామ పంచాయతీలో స్వచ్ఛ పదం గ్రామ శుభ్రత మన బాధ్యత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిమండలం స్పెషల్ ఆఫీసర్ అయినా ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




Comments