ఎంపీ సీఎం రమేష్ నాయుడుకు మాతృవియోగం
- EDITOR

- Nov 26, 2025
- 1 min read
ఎంపీ సీఎం రమేష్ నాయుడుకు మాతృవియోగం

వైయస్సార్ కడప జిల్లా
అనకాపల్లి బిజెపి ఎంపీ సిఎం రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు తల్లి చింతకుంట రత్నమ్మ (83), బుధవారం ఉదయం కన్నుమూశారు. రత్నమ్మ అనారోగ్యంతో గత వారం రోజుల నుండి హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతు నిన్నటి దినం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామం వారి స్వగ్రామం నందు రత్నమ్మను కూటమి ఎమ్మెల్యేలు ప్రముఖ రాజకీయ నాయకులు పారిశ్రామిక వ్యక్తులు రత్నమ్మ త్వరగా కోలుకోవాలని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం నింపారు.. నేడు ఉదయం 3 గంటల ప్రాంతంలో రత్నమ కన్నుమూశారు. చింతకుంట మునిస్వామి నాయుడు వారి సతీమణి రత్నమ్మకు పలువురు సంతాపం తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని భగవంతుని ప్రార్థించారు. గురువారం పొట్లదుత్తి గ్రామంలో అంతక్రియ నిర్వహిస్తామని వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు.



Comments