top of page

జర్నలిస్ట్ క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 12, 2022
  • 1 min read

జర్నలిస్ట్ క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రదానోత్సవం కి ముఖ్యఅతిథిగా గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న క్రికెట్ ప్లేయర్స్ ఆరు టీం లుగా బరిలో దిగారు వారిలో గెలుపొందిన టీములకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది విన్నర్స్ టీమ్ వెబ్ వారియర్స్, రన్నర్స్ టీమ్ వైజాగ్ జేసాఫ్ టీమ్, థర్డ్ గాజువాక ఏ టీమ్ లకు కప్ లు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధులకు తెలిసే విధంగా మీ రాతతో సమాజాన్ని మారుస్తూ ఎన్నో ఒత్తిడిలకు గురవుతుంటారు అలాంటప్పుడు ఇలాంటి క్రీడలు ఎంతో రిలీఫ్ ఇవ్వడం జరుగుతుందన్నారు వ్యాయామంతో ఆరోగ్యంతో పాటు మానసిక దైర్యాన్ని పొందుతారు అన్నారు అన్నారు అంతేకాకుండా ఎన్నో ఏళ్లగా గాజువాక జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఒక కలగా మిగిలిపోయింది అన్నారు నా హయాంలో ఆ కల నెరవేర్చే విధంగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు త్వరలోనే ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ భూపతి రాజు శ్రీనువాస రాజు డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన తల్లి, కార్పొరేటర్లు తిప్పల వంశీ రెడ్డి, భూపతి రాజు సుజాత, రాజన రామ రావు, బొడ్డు నరసింహా పాత్రుడు, వైసీపీ నాయకులు దర్మాల శ్రీను, రెడ్డి జగన్నాధం,పల్లా పెంటరావు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కోయిలడ పరశురాము, గిరి బాబు, కృష్ణ, రాజు, ప్రకాశ్, మూర్తీ, గోవింద్ ఈశ్వరరావు, అమిత్, సంతోష్, శ్రీను,

క్రికెట్ జర్నలిస్టులు, పాల్గొన్నారు..

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page