ఏలూరు ఆర్డీఓ గా కె. పెంచల్ కిశోర్ పదవీ బాధ్యతలు స్వీకరణ
- VOICE OF HERALD

- Apr 6, 2022
- 1 min read

ఏలూరు, ఏప్రిల్, 6: ఏలూరు రెవిన్యూ డివిజినల్ అధికారిగా కె. పెంచల్ కిశోర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో ఇప్పటి వరకు ఇంచార్జి ఆర్డీఓ గా ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ టి . రాహుల్ కుమార్ రెడ్డి నుండి ఛార్జ్ ని స్వీకరించారు. కె. పెంచల్ కిశోర్ విశాఖపట్నం ఆర్డీఓ గా పనిచేస్తూ జిల్లాల విభజనలో ఏలూరు ఆర్డీఓ గా బదిలీ అయ్యారు. ఏలూరు డివిజన్ కు చెందిన తహసీల్దార్లు, ఎంపిడిఓ లు ఆర్డీఓ పెంచల్ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు.


Comments