top of page

మున్సిపల్ సిబ్బందిని పలకరించిన కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 2
  • 1 min read

మున్సిపల్ సిబ్బందిని పలకరించిన కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్

రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగి కొత్తమిద్దె శ్రీనివాస రెడ్డి దంపతులను సన్మానిస్తున్న మున్సిపల్ కమిషనర్
రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగి కొత్తమిద్దె శ్రీనివాస రెడ్డి దంపతులను సన్మానిస్తున్న మున్సిపల్ కమిషనర్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు : గత నెల జులై 31న రిటైర్ అయిన మున్సిపాలిటీ చిరు ఉద్యోగి కొత్తమిది శ్రీనివాస రెడ్డి దంపతులను కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, శైలజ దంపతులు సన్మానించారు. ఆదివారం స్థానిక బాలాజినగర్ లో నివాసముంటున్న విశ్రాంతి ఉద్యోగి శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్లి దంపతులను అభినందించారు. సందర్బంగా కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ శ్రీనివాస రెడ్డి తన 40 సంవత్సరాల సేవా కాలంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా మున్సిపల్ & అర్బన్ డెవలప్మెంట్ శాఖలో శానిటేషన్, రెవిన్యూ ఇలా వివిధ సెక్షన్స్ లో 40 సంవత్సరాలు విశేష సేవలు అందించారాని కొనియాడారు. అనివార్య కారణాల వలన రిటైర్మెంట్ అభినందన సభకు రాలేకపోయానని అందువలన స్వయంగా ఇంటికి వచ్చి పలకరించాల్సి వచ్చిందని అన్నారు. కమీషనర్ తో శానిటేరీ సూపర్వైజర్ నూరు బాషా తదితరులు ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page