కాలనీలో ఆర్టీసీ బస్సులు తిరగక ఇబ్బందులు
- VOICE OF HERALD

- Jan 22, 2022
- 1 min read
గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, నిర్వాసిత కాలనీ లైన కణితి కాలనీలో గత గతంలో 632 అలాగే 638 కణితి కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులు ఉండేవని దానిని మళ్లించి శత్రువే పంపుతున్నారని 16 గ్రామాల ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సు లేక వాణిజ్యపరంగా ను లక్ష మందికి పైగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ విషయం మీద గౌరవ ఎమ్మెల్యే గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు స్పందించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగదని గాజువాక ఆర్టీసీ ఎండి గారికి మళ్లీ ఆర్టీసీ బస్సులు తిరగాలని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా గా చూడాలని తెలియపరిచారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు ప్రగఢ శంకర్రావు, ప్రగడ వేణు బాబు, శ్రీనివాసు, కోనా వెంకటేశ్వరరావు, శ్రీనివాస రావు వినతి పత్రం అందజేయడం జరిగినది ఈ విషయం మీద ఆర్టిసి ఎండి గారు సానుకూలంగా వ్యవహరిస్తామని తెలియపరిచారు.




Comments