top of page

దళిత బాలిక అత్యాచారం కేసు - వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 12, 2022
  • 1 min read

ప్రొద్దుటూరులో సంచలనం రేపిన దళిత బాలిక అత్యాచారం కేసుపై కడపజిల్లా అదనపు ఎస్పీ నీలం పూజిత వివరణ ఇచ్చారు.

మహిళా పోలీసుల ద్వారా అమ్మాయి గర్భము దాల్చిన విషయం ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ సిఐ దృష్టికి వచ్చిందని, బాలిక తల్లిదండ్రులు ఎవరనేది చేసిన ఎంక్వరీ లో బాలిక తన తల్లిదండ్రుల వివరాలను మాత్రం తెలుపలేదని, బాలిక తరుపు బంధువులు, తల్లిదండ్రులు ఎవరు అనేది తేలకపోవడంతో బాలికని మైలవరంలోని డాడీ హోం లో వదిలిన రూరల్ పోలీసులు వదిలారని, కేసు విచారణలో బాలిక తల్లిదండ్రుల్ని 9వ తేది గుర్తించిన మూడవ పట్టణ పోలీసులు బాలిక విషయం తల్లిదండ్రులకు తెలిపిన పోలీసులు బాలిక తండ్రి మానసిక స్థితి సరిగలేనందున కంప్లైంట్ ఇవ్వడానికి తల్లిదండ్రులు నిరకరించారని, ఏఎస్పీ నీలం పూజిత తెలిపారు. ఐ.సి.డి.ఎస్.అధికారుల కంప్లైంట్ ఆధారంగా బాలిక దగ్గర నుండి వివరాలు సేకరించిన పోలీసులు. విచారణలో తనపై నలుగురు అత్యాచారం చేసారని బాలిక వెల్లడించిందని, వెంటనే ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి ఫోక్స్కో కేసు నమోదు చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page