చిట్వేలు నూతన ఎమ్మార్వో గా వైయస్ సత్యానందం బాధ్యతలు.
- DORA SWAMY

- May 18, 2022
- 1 min read
చిట్వేలు నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ సత్యానందం.
---సత్వరమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండల నూతన ఎమ్మార్వో గా సత్యానందం ఈరోజు బాధ్యతలు చేపట్టారు. రాయచోటి మండలం సంబేపల్లి నందు విధుల్లో ఉన్న తాను చిట్వేల్ లో విధులు నిర్వహిస్తున్న జీవన్ చంద్రశేఖర్ బదిలీ మీద సంబేపల్లె మండలానికి రావడంతో తాను ఈ మండలానికి బదిలీ అయినట్లు పేర్కొంటూ.. అన్ని వేళల మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు, అధికారుల తో కలసి సమన్వయంతో పనిచేస్తూ ప్రజా రెవిన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని,నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని మండల రెవెన్యూ అధికారి వైయస్ సత్యానందం పేర్కొన్నారు.



Comments