రాజశ్యామలాదేవి యాగంలో పాల్గొన్న సీఎం జగన్
- VOICE OF HERALD

- Feb 9, 2022
- 1 min read
శ్రీ శారదా పీఠంలో మూడో రోజు కొనసాగుతున్న రాజశ్యామలాదేవి యాగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సంకల్పం చేయించారు. తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. సీఎం వైఎస్ జగన్తోపాటు రాజశ్యామలాదేవి యాగంలో వై.వి సుబ్బారెడ్డి ఆయన సతీమణి స్వర్ణమ్మ పాల్గొన్నారు.




Comments