వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి శంకుస్థాపన
- VOICE OF HERALD

- Feb 12, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న N.G.O కాలనీ లో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వాములవారి ఆలయ మందిరాల తో కూడిన ఆశ్రమ వ్యవస్థ శ్రీ "బ్రహ్మపదం" బ్రహ్మశ్రీ డాక్టర్ కృష్ణమాచార్య స్వాముల వారి అమృత హస్తముల చే శనివారం ఉదయం 8.05 నిమిషాలకు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొని రెడ్డి శివ చంద్రారెడ్డి, పోరెడ్డి నరసింహా రెడ్డి, షేట్ గురువు రెడ్డి, వరికూటి ఓబుల్ రెడ్డి, బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి ( సూరి ) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.




Comments