top of page

స్వచ్ సర్వేక్షన్ లో భాగంగా 86 వ వార్డు సందర్శించిన కమిషనర్ లక్ష్మిషా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 14, 2022
  • 1 min read

కూర్మన్నపాలెం 86 వ వార్డులో ఈరోజు ఉదయం స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా గా జీవీఎంసీ జోన్ 6 ఏ ఎమ్ హెచ్ ఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కూర్మం పాలెం సాయిబాబా గుడి సమీపంలోగల పార్క్ లో ముఖ్య అతిథులుగా జివిఎంసి కమిషనర్ లక్ష్మీ షా, జోనల్ కమిషనర్ డి శ్రీధర్, వైసిపి సీనియర్ నాయకులు దామా సుబ్బారావు, 86 వ వార్డు కార్పొరేటర్ నేళ్ల కోటేశ్వరరావు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సుజాత నగర్ కు చెందిన మీనాక్షి కూచిపూడి డ్యాన్స్ అసోసియేషన్ వారి పిల్లలు స్వచ్ సర్వేక్షన్ పాటకు నృత్య రూపంలో రూపంలో డాన్స్ చేసి అక్కడ వాకింగ్ చేస్తున్న ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డాన్స్ చేసిన పిల్లలకు కు కమిషనర్ లక్ష్మీ షా దామా సుబ్బారావు నేళ్ల కోటేశ్వర చేతులమీదుగా జీవీఎంసీ వారి మెమెంటోలు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గా ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో 86 వ వార్డు వైసీపీ ఇంచార్జ్ దామా సుబ్బారావు కమిషనర్ లక్ష్మి శాఖ సమర్పించి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడటం కూడా జరిగింది ముఖ్యంగా దువ్వాడ రోడ్డు ఎక్స్టెన్షన్, హెల్త్ సెంటర్స్. బడుగు బలహీన వర్గాల ప్రాంతాలలో గృహ నిర్మాణానికి, రైతు బజార్లు రోడ్ల విస్తరణ మురికివాడ కాలువల విస్తరణ ఫకీర్ చెక్కి ,దువ్వాడ ,రాజీవ్ నగర్, ఉప్పర కాలనీ అనేక ఏరియాలో పెండింగ్ పనులు మరమత్తు చేయవలసిన పనులు పై వివరించడం జరిగింది. లక్ష్మీ షా సానుకూలంగా స్పందించి పేద కుటుంబాలు 60 గజాల లోపు గృహనిర్మాణం చేసుకునేవారికి జి ప్లస్ వన్ లేక వన్ ప్లస్ వన్ చేసుకునేవారికి ఎటువంటి టి డి ఆర్ ప్లాను గాని అవసరం లేదని సచివాలయం ప్లానింగ్ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో వార్డు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు సొసైటీ సంస్థలు, జివిఎంసి కమిషనర్ శ్రీధర్ షేర్ఇట్ ట్రీ సీనియర్ ఇన్స్పెక్టర్ రామారావు, టౌన్ ప్లానింగ్ ఏ సి పి రమణ మూర్తి , సచివాలయం వాలంటరీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అడ్మిన్ లు వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొనడం జరిగింది

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page