top of page

అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా - వైజాగ్ స్టీల్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 18, 2022
  • 1 min read

నూతన వేతనాలు అమలు కొరకు HOD ఆఫీసుల వద్ద ధర్నాకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి, ఈ సందర్భంగా వారు కరపత్రం విడుదల చేశారు, వివరాల్లోకి వెళితే సెయిల్ లాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు నూతన వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తాయామని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్లాంట్ లోని RMHP నుండి విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ వరకు అన్ని HOD కకార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టాలని కార్మికులకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అలాగే సాయంత్రం 4 గంటలకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు, భవిష్యత్ కార్యాచరణ ఈ ఎలా 20వ తేదిన మరలా ఉదయం 11 గంటలకు ఈడీ వర్క్స్ కార్యాలయం వద్ద ధర్నా కలదని ౨౫వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సంధర్భముగా అఖిలపక్ష కార్మిక సంఘాలు తెలిపాయి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page