top of page

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 5, 2022
  • 1 min read

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 9న శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. శారదాపీఠంలో నిర్వహించే రుద్రయాగం, రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఇటీవల సీఎం జగన్ ను ఆహ్వానించారు. శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర ఇటీవల తాడేపల్లి విచ్చేసి సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక అందజేశారు.


ఫిబ్రవరి 9న సీఎం జగన్ ఉదయం గన్నవరం నుంచి బయల్దేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి వెళతారు. అక్కడి కార్యక్రమాలు ముగిసిన అనంతరం విజయవాడ తిరుగుపయనమవుతారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page