top of page

ప్రకాష్ నగర్, వివేకానంద కాలనీలలో టిడిపి ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 24, 2024
  • 1 min read

ప్రకాష్ నగర్, వివేకానంద కాలనీలలో టిడిపి ప్రచారం

ప్రకాష్ నగర్ లో ప్రచారంలో పాల్గొన్న వరద
వరద సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


టిడిపి ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ప్రకాష్ నగర్ వివేకానంద కాలనీలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి, సినీ హబ్ రాజేశ్వర్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని ఇక్కడ ప్రజలను ఓట్ల అభ్యర్థించారు. ఇదిలా ఉండగా, వివేకానంద నగర్ కాలనీలో దాదాపు 50 కుటుంబాలు వైసిపి నుండి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వంగనూరు మురళీధర్ రెడ్డి, షేక్ మునీర్, రాజుపాలెం మాజీ జడ్పిటిసి వెళ్లాల భాస్కర్, పగడాల దుస్తగిరి, నడిపి దస్తగిరి, తుపాకుల రామసుబ్బయ్య, తుపాకుల నాగరాజు, తుపాకుల మధు, అరవ శివ, బడిగింజల ఆంజనేయులు, వీర హనుమాన్, కంచి రాఘవ, నాయుడు కుమార్ స్వామి, మునగల చంద్ర, అల్లావుద్దీన్, నాయుడు మస్తాన్, ఎర్రంశెట్టి భాను, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.




1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Apr 24, 2024
Rated 5 out of 5 stars.

Good

Like
bottom of page