ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు
- VOICE OF HERALD

- Feb 7, 2022
- 1 min read
అడపుర్ పంచాయతీ ఎగువ హారిజనవాడ కాలనీ లో నీ ప్రభుత్వ భూమిని కొది రోజుల కిందట కొందరు ఆక్రమించి ఇల్లు నిర్మించుటకు పిల్లర్ లు వేసినారు.వెంటనే గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ & MRO కి వినపించగా, వెంటనే అధికార్లు గ్రామం లో విచారించి అక్రమ కట్టడాలను నిలిపి వేశారు. ఆక్రమనదారుడికి 4 దినములు సమయం ఇచ్చి తగిన పత్రములు చుపించమని కోరారు అధికారులు.10 రోజులు అవుతునపటికి వాళ్ళ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఈ రోజు మండల తహశీల్దార్ ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రెటరీ & VRO కలిసి ఆ స్థలం లో ప్రభుత్వ బోర్డ్ నాటి గ్రామ అవసరాల కోసం ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం నీ కేటాయించారు. ఈ విషయం పై గ్రామస్తులు ఆనందం తో ఆ అధికారులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ప్రభుత్వ అధికార్లు ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు గురికాకుండా తమ విధులను సక్రమంగా నిర్వతిస్తే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయి అని స్థానికులు చర్చించుకుంటున్నారు.



Comments