top of page

కొత్త పార్లమెంట్ హౌస్‎ను ప్రారంభించిన పీఎం మోదీ..

  • Writer: EDITOR
    EDITOR
  • May 28, 2023
  • 1 min read

కొత్త పార్లమెంట్ హౌస్‎ను ప్రారంభించిన పీఎం మోదీ

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పూర్తి వైదిక ఆచారాలతో పూజలు, హవనం చేసిన తర్వాత ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు..


ఆదివారం ఉదయం 7:30 గంటలకు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాగా, వైదిక ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు, హవనంతో కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పుడు పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం పూర్తి షెడ్యూల్‌ గురించి తెలుసుకుందాం..

ప్రధాని మోదీ ఉదయం 7:15 గంటలకు పార్లమెంటు భవనానికి చేరుకుంటారు :


పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం కోసం, పూజ, హవన కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 7:15 గంటలకు పార్లమెంట్ హౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 7.30 గంటలకు పార్లమెంట్‌ భవనంలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పందాల్లో పూజ, హవన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొత్త పార్లమెంటు భవనం లోపల నిర్మించిన లోక్‌సభ ఛాంబర్‌లో ఉదయం 8:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది, ఇది రాత్రి 9 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. కాగా, లోక్‌సభ స్పీకర్‌ సీటుకు సమీపంలో ప్రధాని నరేంద్ర మోదీ పవిత్ర సెంగోల్‌ను ఏర్పాటు చేయనున్నారు..

ఉదయం 9:30 గంటలకు పార్లమెంటు లాబీలో సర్వమత ప్రార్థనా సమావేశం ప్రారంభమవుతుంది. దాదాపు అరగంట పాటు జరిగే ఈ ప్రార్థనా సమావేశానికి శంకరాచార్యులు, సాధువులు, ఎందరో పండిత పండితులు హాజరుకానున్నారు. కొత్త పార్లమెంట్ భవనం రెండో దశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. ఆహ్వానిత ప్రముఖులు, ఎంపీలు ప్రారంభోత్సవం ప్రధాన కార్యక్రమంలో పాల్గొనడానికి కొత్త పార్లమెంటు భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌కు చేరుకుంటారు. రెండో దశ కార్యక్రమం మధ్యాహ్నం 12:07 గంటలకు జాతీయ గీతాలాపనతో ప్రారంభమవుతుంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page