రామాలయం నిర్మించిన ముస్లిం సోదరుడు
- VOICE OF HERALD

- Jun 20, 2022
- 1 min read
గ్రామంలో హిందువుల కోసం రామాలయం నిర్మించిన ముస్లిం సోదరుడు

రామాలయం నిర్మించిన ముస్లిం మతసామరస్యానికి భారతదేశం రోల్ మోడల్ అని మరోసారి నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రం లో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామ సర్పంచ్ షేక్ మీరాసాహెబ్ తన సొంత డబ్బులతో రామాలయం నిర్మించారు. హిందూ ఆచారాలు సంస్కృతిని ఎంతో గౌరవించే ఆయన తన డబ్బు రూ.25 లక్షలతో గుడిని నిర్మించారు.దీంతో ఆయనను అంతా అభినందిస్తున్నారు.



Comments