వైకుంఠ ఏకాదశికి శ్రీకాళహస్తి లో ఏర్పాట్లు పూర్తి
- VOICE OF HERALD

- Jan 12, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాళహస్తిశ్వర దేవస్థానంము కు అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి వారి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను దేవస్థాన అధికారులు పరిశీలించి అక్కడ సిబ్బందికి తగు సూచనలు చేశారు. అలాగే ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాస శర్మ గారు నుండి రేపు జరుగు పూజాది కార్యక్రమాలు వివరములు దర్శన వేళలు అడిగి తెలుసుకున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమగును. అనంతరం సర్వదర్శనం ఉదయం 5 గంటల నుండి ప్రారంభమగును అని తెలిపారు.



Comments