ఐటీడీఏకు రెగ్యులర్ అధికారిని డీడీ గా నియమించాలని కొనసాగుతున్న దీక్షలు
- VOICE OF HERALD

- Feb 21, 2022
- 1 min read
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏకు మాతృ సంస్థకు చెందిన రెగ్యులర్ అధికారిని డీడీ గా నియమించాలని గత కొన్ని వారాలుగా ప్రతీ సోమవారం జరుగుతున్న నిరసన దీక్ష ఈరోజు కూడా కొనసాగింది. పార్వతీపురం ఐటీడీఏ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ కోరారు. గిరిజన మంత్రి సొంతం జిల్లాలో గిరిజన విద్యా రంగం అస్త వ్యస్తంగా తయారయ్యిందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, గిరిజన యువత పాల్గొన్నారు.




Comments