జనవరి నుంచి పెన్షన్ రూ.2750 - సీఎం జగన్
- VOICE OF HERALD

- Sep 23, 2022
- 1 min read
జనవరి నుంచి పెన్షన్ రూ.2750 - సీఎం జగన్
చిత్తూరు జిల్లా, కుప్పం, ప్రసన్న ఆంధ్ర సెప్టెంబర్ 23 :

ఆంధ్రప్రదేశ్ లో జనవరి నెల నుంచి రూ.2500లు ఉన్న పెన్షన్ ను రూ.2750లకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో రూ.11కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనవరి నెల నుంచి పెన్షన్ రూ.2750లకు పెంచి ఇవ్వనున్నామని, ఇది మహిళల ప్రభుత్వమని, ప్రతి మహిళకు ఏటా రూ.18,750లు ఇస్తున్నామన్నారు.



Comments