పి.ఆర్.సి పై హోంమంత్రి సుచరిత కామెంట్స్
- VOICE OF HERALD

- Feb 3, 2022
- 1 min read
గుంటూరు, పి.ఆర్.సి ని వ్యతిరేకిస్తూ చలో విజయవాడ అంటూ నిరసన బాట పట్టిన ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్దేశించి రాష్ట్ర హోంమంత్రి సుచరితకామెంట్స్ చేశారు, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అని, కానీ చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్దం అన్నారు ఆమె, తమకు ఉద్యోగులు సహకరించాలని సిఎం కూడా కోరారు, దాని కోసం కమిటీ కూడా వేశాం అన్నారు, ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది అని ఆమె హితువు పలికారు, ఎక్కడా కూడా హౌస్ అరెస్టు లు లేవు అని, కానీ అనుమతి లేని సభలకు సమావేశాలకు వెళ్ళవద్దని చెప్పాం అన్నారు, గత రెండు సంవత్సరాలుగా కరోనాతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల పాలు అయ్యింది అన్నారు.



Comments