top of page

ఆత్మీయుల కన్నీటి ధారల మధ్య మొదటి వర్ధంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 8, 2022
  • 1 min read

ఆత్మీయుల కన్నీటి ధారల మధ్య మొదటి వర్ధంతి

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

స్థానిక గోపికృష్ణ సెంట్రల్ స్కూల్ నందు నేడు ఆ పాఠశాల వ్యవస్థాపకులు దివంగత కోనేటి వెంకట రమణారెడ్డి మొదటి వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు, నాయకులు,పాఠశాల పూర్వ విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. పాఠశాల ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన మొదటి వర్ధంతి సంతాప సభకు ముఖ్య అతిధులుగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, మామిళ్ళ మల్లికార్జున రావు, బీజేపీ నాయకులు శశిభూషణ్ రెడ్డి, సీవీ విజయ లక్ష్మి, కొవ్వూరు బాలచంద్రా రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, సాధన కళాశాల వెంకట్ రెడ్డి, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ దివంగత కోనేటి వెంకట రమణారెడ్డి విద్యా రంగానికి చేసిన సేవలను, అలాగే ఆయన సమాజానికి చేసిన పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. రాబోవు అయిదు రోజులు సంతాప దినాలుగా పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన కుమారులు తెలియచేసారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా పలువురు స్వచ్చందంగా రక్తదానం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page