చెత్త పన్ను ఆస్తిపన్నులు జీవోను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ డిమాండ్
- VOICE OF HERALD

- Feb 5, 2022
- 1 min read
గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, గాజువాక నియోజకవర్గ చెత్త పన్ను, ఆస్తిపన్నులు జీవోను తక్షణమే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ల పట్ల అధికార పార్టీ అవలంబిస్తున్న వివక్షతను నిరసిస్తూ, రాజకీయాలకతీతంగా వార్డు అభివృద్ధి పనులు కేటాయించాలని కోరుతూ, ప్రజలపై మోయలేని భారంగా మారిన చెత్త పన్ను, ఆస్తిపన్నులు జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు జీవీఎంసీ గాజువాక జోన్ కార్యాలయం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంఘీభావం చేపట్టారు, ఈ కార్యక్రమానికి అన్ని వార్డుల కార్పొరేటర్లు కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరై సంఘీభావం తెలియచేసారు.




Comments