జగనే రాజు జగనే మంత్రి, కొత్త మంత్రులు కొలువుదీరే వరకు
- VOICE OF HERALD

- Apr 8, 2022
- 1 min read
ఏపీలో మొత్తం మంత్రులు అంతా రాజీనామాలు చేశారు. అంటే మంత్రి అన్న వారు ఇపుడు ఏపీ సర్కార్ లో ఎవరూ లేరన్న మాట. ఇక మిగిలింది ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే. కొత్త మంత్రివర్గం ఎపుడు ప్రమాణం చేస్తుంది అన్నది చూస్తే ఈ నెల 11వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు అని చెబుతున్నారు.

దాంతో కొత్త మంత్రివర్గం కొలువుతీరే వరకూ జగనే సోలోగా ఉంటారన్న మాట. అంటే ఆయనే రాజు ఆయనే మంత్రి అన్న మాట. నిజానికి ఈ రకమైన పరిస్థితి గతంలో ఉందా అంటే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు కూడా ఇలాగే పరిస్థితి ఉంది.
ఆనాడు అంటే 2019 మే 30న జగన్ ఒక్కరే సీఎం గా ప్రమాణం చేశారు. ఆ తరువాత జూన్ 8న కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. అంటే నాడు తొమ్మిది రోజుల పాటు జగన్ ఒక్కరే ఏపీని పాలించారు. దాంతో ఈసారి నాలుగు రోజులు సైతం జగనే టోటల్ క్యాబినేట్ గా ఉంటారన్న మాట.
ఈ మధ్యలో ఆయన కొత్త మంత్రులను ఎంపిక చేసుకుని ఆ జాబితాను గవర్నర్ కి పంపడం 11న ఉదయం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కొత్త మంత్రులు వచ్చి పాలనా పగ్గాలు పుచ్చుకునే దాకా జగన్ ఒక్కడే ఏపీకి పరిపాలకుడు. అంతే.



Comments