top of page

కోర్టు తీర్పు వ్యతిరేకిస్తూ వెల్లువెత్తిన నిరసనలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 10, 2023
  • 1 min read

--నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో నిరసనలు.

మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...స్కిల్ డెవలప్మెంట్ నిధులు పక్క దారి పట్టించారంటూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ తీర్పు.. తదుపరి రిమాండ్ తరలింపు చేపట్టగా.. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి నిరసన జ్వాల లు వ్యక్తం అయ్యాయి.

ఈ క్రమంలో భాగంగా చిట్వేలి మండల పరిధిలోని సి. కందుల వారి పల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ బాలు రామాంజులు నాయుడు , టిడిపి నాయకులు లారీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర భారీగా తరలివచ్చిన జనం కొవ్వొత్తులతో నిరసనలు ప్రకటించారు. కళ్ళకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇది చరిత్రలో చీకటి రోజు అని వారు అన్నారు. ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్య అని వారు తెలిపారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకులు కాకర్ల నాగార్జున , కాకర్ల కోటేశ్వర , బాలు రెడ్డయ్య ,నంద్యాల ధనంజయ, డేరంగుల వెంకటేష్ మరియు టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page