ఎమ్మార్వో సత్యానందం ను సన్మానించిన మండల రేషన్ డీలర్లు.
- DORA SWAMY

- May 20, 2022
- 1 min read
నూతన ఎమ్మార్వో ను సన్మానించిన రేషన్ డీలర్లు.
--తమకు అందే బస్తాలు సరైన తూకం లేదంటూ విన్నపం.
--డీలర్ల గడువు పొడిగించాలంటూ వినతి.

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం రేషన్ డీలర్ల అసోసియేషన్ సంఘం సభ్యులు చిట్వేలి మండల నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు తీసుకొన్న వైయస్ సత్యానందం ను ఈ రోజున రెవిన్యూ కార్యాలయం లో సన్మానించారు.
ఈ సమావేశంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెల్లారు. ముఖ్యంగా గోడం నుంచి బియ్యం బస్తాలు సరైన తూకం లేకపోవడంతో డీలర్లు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారని, M D U ఆపరేటర్లకు, డీలర్లకు మధ్య తూకం తరుగుదల సమస్య డీలర్లకు తీవ్ర భారంగా మారిందని పేర్కొంటూ రేషన్ డీలర్ల ఆథరైజేషన్ గడువు ముగిసిన డీలర్లకు రెన్యువల్ చేయించేలాని ఎమ్మార్వోకి విన్నవించారు.
ఈ సమావేశంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, చిట్వేలు మండలం రేషన్ డీలర్ల అధ్యక్షుడు డి. శివ ప్రసాద్ యాదవ్, ఉపాధ్యక్షులు కోటేశ్వర నాయుడు, సెక్రెటరీ రసూల్ సాబ్, కోశాదికారి శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ రామకృష్ణ,కార్యనిర్వాహక కార్యదర్శి ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు.



Comments