top of page

ఘనంగా విస్డమ్ పాఠశాలలో బాలల దినోత్సవం

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 14, 2023
  • 1 min read

ఘనంగా విస్డమ్ పాఠశాలలో బాలల దినోత్సవం

నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం సందర్భంగా మండలంలోని విస్డం స్కూల్ నందు బాలలకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ వలిమి రాధ ఆధ్వర్యంలో బాలబాలికలకు ఆటపాటలు నిర్వహించి వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వ్యాయామము, ఆటలు పాటలలో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. అప్పుడే వారికి మానసికల్లాసం కలిగి సర్వతో ముఖాభి అభివృద్ధి చెందుతారని, విద్యలో చురుకుగా ఉంటారని తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చొక్కా రాజు వెంకట రవీంద్ర రాజు పాల్గొని, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాచా నెహ్రూ పిల్లల పట్ల అమిత ప్రేమ కలిగిన వారిని, నేటి పిల్లలే రేపటి పౌరులనీ, భావి భారత శాసనకర్తలని తెలిపారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచి వందన సమర్పణ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కార్తీక్, త్రివేణి, మస్తానీ, పుష్ప, లక్ష్మీ, గాయత్రి, హసీన్ మరియు తానాజ్ మొదలగువారు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page