పైకప్పు కూలి భవన కార్మికుడు మృతి
- VOICE OF HERALD

- Jan 6, 2022
- 1 min read
Updated: Jan 7, 2022
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పేరం బజారులో ఓ భవన కార్మికుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పేరం బజారులోని శిథిలమైన భవనం పైకప్పు కూలి కార్మికుడు మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మృతి చెందిన భవన కార్మికుని వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.



Comments