top of page

స్వచ్ఛ సర్వేక్షణ పై అవగాహన సదస్సు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 19, 2022
  • 1 min read

అగనంపూడి ప్రసన్న ఆంధ్ర వార్త


అగనంపూడి వాకింగ్ ట్రాక్ లో స్వచ్ఛ సర్వేక్షణ పై అవగాహన సదస్సు ఏర్పాటు

అగనంపూడి వాకింగ్ ట్రాక్ లో స్వచ్ఛ సర్వేక్షణ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యఅతిథి జీవీఎంసీ గాజువాక జోన్ శానిటరీ సూపర్వైజర్ బీవీ రామారావు

బీవీ రామరావు మాట్లాడుతూ నగర ప్రజల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షన్ లో విశాఖ నగరం ప్రథమ స్థానం రావడానికి సహకరించాలి ఇప్పటికీ విశాఖ నగరంలో 2,60,000 పైగా స్వచ్ఛంద సంస్థలు , సీనియర్ సిటిజన్స్ రెసిడెన్షియల వెల్ఫేర్ అసోసియేషన్ ,కాలేజీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది .తడి చెత్త పొడి చెత్త విభజన చేసి మీ ఇళ్లకు వచ్చే చెత్త వ్యాన్లకు అందజేయాలి ప్లాస్టిక్ సంచుల్లో నిరోధించే గోనెసంచిలు వినియోగించాలి ఈ వాకింగ్ ట్రాక్ లో డస్ట్ బిన్ లు ఏర్పాటు చేస్తాం వాటిల్లోనే చెత్త వేయాలని కోరారు.


ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా నగర పౌరులు స్వచ్ఛ సర్వేక్షణలో జీవిఎంసీ వారు నిబంధనలను అనుసరీంలించాలని కోరారు అగనంపూడి వాకింగ్ ట్రాక్ లో జీవీఎంసీ తరుపున హైమాక్స్ లైట్లు శరీర వ్యాయామం నాకు కావలిసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి కోరారు.

అగనంపూడి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మాడుగుల నర్సింగరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వాకర్స్ కే సత్య రావు ,ఎం నూకరాజు, కే అప్పలరాజు ,చిన్ని పూర్ణ ,జీవీఎంసీ 79 ,85 వార్డులో సచివాలయంల పర్యావరణ ,శానిటరీ కార్యదర్శులు కే రాంబాబు ,సిహెచ్ వెంకటేశ్వరరావు ,జే నరేష్ సూపర్వైజర్ స్వామి ,బాలమణి మరియు వాకర్స్ పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page